loading...
కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న జియో ఇప్పుడు తాజా ఆఫర్లతో కష్టమర్లకు కష్టాలను కొనితెచ్చిపెట్టేలా ఉంది. జూలై 15తో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ముగిసిపోతున్న నేపథ్యంలో జియో ఇప్పుడు కొత్త ఆఫర్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే జియో తన ప్లాన్లను మార్చివేసింది.ఇంతకు ముందు రూ.309తో రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల పాటు యూజర్లకు డేటా లభించేది. ఇప్పుడు దీన్ని నెలకు కుదించింది. జులై1 నుంచి రూ.309 ప్లాన్ కింద సాధారణ వినియోగదారులకు 3 నెలలకు బదులుగా... 28 రోజులకు 28GB డేటా మాత్రమే అందనుంది. .509తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల పాటు 2జిబి 4జీ డేటా అన్ లిమిటెడ్ వాయిస్ వాయిస్ కాలింగ్ వస్తుంది. జూలై 15 తర్వాత ఆటోమేటిగ్గా ఈ ప్లాన్ మొదలవుతుంది.
మరోవైపు ధన్ ధనా ధన్ ప్లాన్ కింద ఉన్న కస్టమర్లకు 84 రోజుల పాటు 84GB డేటా అందిస్తున్నట్లు జియో వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కూడా జూలై 15తో ముగిసే అవకాశం ఉంది.అయితే ఈ ప్లాను వేయించుకోవాలంటే కష్టమర్లు ఆసక్తి చూపుతారా లేరా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కాగా, చాలామంది వెనక్కి తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఇంచుమించుగా అన్ని టెలికం సంస్థలు ఇదే రకమైన ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో ఇప్పుడు జియో కొత్త ఆఫర్లను ప్రకటిస్తుందా లేదో . ఇకపోతే రాబోయే రోజులు పండగా సీజన్ కావడంతో ఆ పేరుతో జియో తన కొత్త ఆఫర్లను ప్రకటించే అవకాశం కూడా ఉండొచ్చు. దీంతోపాటు సెప్టెంబర్ 5న జియో ఫస్ట్ యానివర్సరీ రానుండటంతో కొత్త ఆ పేరుతో యానవర్సరీ ఆఫర్లను అందిచే అవకాశం కూడా ఉంది. జియో నుంచి సమాచారం వచ్చేంతవరకు కష్టమర్లు వేచి చూడాల్సిందే.
loading...
Blogger Comment
Facebook Comment