loading...
తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భూమిపై గ్రహాంతరవాసులు ఉన్నారా.. ఆదిమానవులు సంచరిస్తున్నారా.. జరిగిన ఘటన చూస్తుంటే మాత్రం ఇది ప్రపంచ బిగ్ బ్రేకింగ్ కాబోతున్నది.
మన ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో గల జన్నారం అడవుల్లోని అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దొరికిన విజువల్స్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి.
ఆదివారం రాత్రి జన్నారంలోని ఓ గూడెంలో గొర్రెలు చనిపోయి కనిపించాయి. ఇటీవల తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.దీనిపై స్పందించిన అటవీ సిబ్బంది.. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 12 గొర్రెలు చనిపోయాయి.
దీన్ని ఎంక్వయిరీ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నారు. కళ్లు బైర్లు కమ్మే..
ఊహించని షాక్ తగిలింది. ఫొటోల్లో ఓ వ్యక్తికి సంబంధించిన అతి పెద్ద పాదం కనిపించింది.
అది మామూలు వ్యక్తికి ఉన్నట్లు లేదు. ఆదిమానవుల ఆనవాళ్లతో పాదం, కాలు వేళ్లు ఉన్నాయి.మరికొన్ని విజువల్స్ లో గ్రహాంతర వాసులను పోలిన వ్యక్తులు కనిపించారు. నెత్తిన రెండు కొమ్ములు, పెద్ద పెద్ద చేతులు, కాళ్లు ఉన్నాయి.
వేటాడే రూపంలో ఉన్నాయి. జన్నారం అడవుల్లో సీసీ కెమెరాకి చిక్కిన వీళ్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు వీళ్లు ఎవరు అని చరిత్రకారులు పరిశోధనలు చేస్తున్నారు.
loading...
Blogger Comment
Facebook Comment